Saturday, April 27, 2024

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కలిసిన- రాజ్య‌స‌భ స‌భ్యులు నిరంజ‌న్ రెడ్డి

నిర్మ‌ల్ : క్యాంప్‌ కార్యాలయంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎస్. నిరంజన్‌ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా నిరంజ‌న్ రెడ్డిని మంత్రి అభినందించి, శుభాకాంక్ష‌లు తెలిపారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన‌ నిరంజ‌న్ రెడ్డిని వైకాపా త‌ర‌పున‌ రాజ్య‌స‌భకు నామినేట్ చేసినందుకు సీఎం జ‌గ‌న్ కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్మల్లోని ఆర్కె కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం లో పలువురు ఆయనను శాలువాతో పూల బొకేలు అందజేసి సత్కరించి అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement