Friday, April 26, 2024

Meera Jasmine: ప‌దేళ్ల త‌రువాత రీ ఎంట్రీ..!

నటి మీరా జాస్మిన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరుకు మలయాళినే అయినా తెలుగుతనం ఉట్టిపడే రూపం తనది. పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్‌ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘భద్ర’, ‘గుడుంబా శంకర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ మీరా జాస్మిన్ కెరీర్ పీక్‌లో ఉండగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కాగా ఈ మధ్య సోషల్‌ మీడియాతో తిరిగి మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ యూత్‌ మతులు పోగొడుతుంది. కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి అభిమానులందరు ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటికి వచ్చింది.

‘విమానం’ అనే తెలుగు-తమిళ బైలింగ్యువల్‌ సినిమాతో మీరా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. జీ స్టూడీయోస్‌, కిరణ్‌ కొర్రపాటి క్రియేటీవ్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. చివరగా తెలుగులో మీరా జాస్మిన్‌ ‘మోక్ష’ అనే సినిమాలో నటించింది. హర్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2013లో రిలీజైంది. శ్రీకాంత్‌ వేములపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పాండే, నాజర్‌, రాహుల్‌ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ‘‘విమానం టీమ్ తరఫున మీరా జాస్మిన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోకి 10ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆమెకు స్వాగతం చెబుతున్నాం’’ అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement