Friday, April 19, 2024

జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.. చంద్రబాబు

జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, జగన్ ను త్వరలోనే ఇంటికి పంపేద్దామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసిపి అంటే బ్లేడ్, గంజాయి బ్యాచ్ లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ఋషికొండను పెద్ద అనకొండ మింగేసిందని.. ప్రజలంతా ఆ సైకోను ఇంటికి పంపాలని నిర్ణయించారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. ఇబ్బందులలో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలుగు జాతికి ప్రపంచమంతా గుర్తింపు కేవలం టిడిపి వల్లే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆస్తి కార్యకర్తలేనన్న చంద్రబాబు.. దేశంలోనే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement