Saturday, April 27, 2024

ఏపీ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది అటవీశాఖ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో డీఎఫ్‌వోలు, సబ్‌ డివిజనల్ ఫారెస్టు అధికారులు ఉన్నారు. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్​గా ఐఎఫ్ఎస్ అధికారి విగ్నేశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి లోని శ్రీవెంకటేశ్వరా జులాజికల్ పార్కు క్యూరేటర్​గా సి.సెల్వాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రంప చోడవరం, శ్రీకాకుళం, అన్నమయ్య, ఏలూరు, వేర్వేరు ప్రాంతాల్లోని అటవీ సంరక్షణాధికారులుగా మిగతా 12 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement