Friday, May 3, 2024

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల‌నేదే సీఎం జ‌గ‌న్ కోరిక – ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

నాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబునాయుడు ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేయాల‌ని చూశార‌ని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయ‌న మాట్లాడారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ చిత్తశుద్ధితో వికేంద్రీకరణ ప్రతిపాదన తీసుకువచ్చారని భూమన కొనియాడారు. తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, సీఎం జగన్ ఆ దిశగా గొప్ప ఆరంభాన్ని ఇస్తున్నారని వివరించారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ కోరుకుంటుంటే…. టీడీపీ, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా విషప్రచారం చేస్తున్నాయని భూమన విమర్శించారు. జగన్ విధానాలతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ, నెల్లూరు ప్రజలకు మద్రాసుతో భావోద్వేగ అనుబంధం ఉందని అన్నారు. ఆనాడు విడిపోవాలని ఎవరూ కోరుకోలేదని, రాయలసీమ ఆనాటి నుంచి నష్టపోతూనే ఉందని తెలిపారు. వైఎస్సార్ సీఎం అయ్యాక రాయలసీమ వాసుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేశారని భూమన వివరించారు. కానీ, రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబు ఏనాడూ ముందుకు రాలేదని, సీమ ప్రజలను పట్టించుకోని చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని భూమ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement