Sunday, May 19, 2024

Follow up | ప్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. రోజంతా సూచీల ఊగిసలాట

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నాడు ప్లాట్‌గా ముగి శాయి. వరస లాభాల తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో ఉదయం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో రోజంతా సూచీలు వడుదొడుకుల మధ్యే కదలాడాయి. చివరిలో కొంత పుంజుకున్న సూచీలు చివరకు ప్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్ప నష్టంతోనూ, నిఫ్టీ స్వల్ప లాభంతో ముగిశాయి.
సెన్సెక్స్‌ 33 పాయింట్ల నష్టంతో 62834.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 4.95 పాయింట్లు లాభపడి 18701.05 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 181 రూపాయలు పెరిగి 54031 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 198 రూపాయలు పెరిగి 66647 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.18 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

- Advertisement -

టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రీడ్‌ కార్పోరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్టులు, హీరో మోటోకార్ప్‌, సిప్లా, బజాజ్‌ ఆటో షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రా సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ ఎం, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, టైటాన్‌ కంపెనీ, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement