Monday, April 29, 2024

మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’ షూటింగ్ పూర్తి

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేం దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను పట్టాలెక్కించడానికి దర్శకుడు అజయ్ భూపతి చాలా సమయం తీసుకున్నాడు. సినిమాలో రెండు ప్రధాన పాత్రలకు హీరోలు సెట్ కావడానికి కూడా టైమ్ పట్టింది. అందువల్లే ఆయన షూటింగు విషయంలో ఆలస్యం చేయలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా షూటింగు కానిచ్చేశాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని సినిమా అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్‌ను కలుపుకుంటూ సాగే కథ ఇది. పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాల ఘర్షణ .. సంఘర్షణ కనిపిస్తాయి. ఈ మూవీలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఓ కీలకపాత్రలో జగపతిబాబు నటించగా, ప్రతినాయకుడి పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ వార్త కూడా చదవండి: బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లు వీరేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement