Thursday, May 16, 2024

Breaking | ఉధృతంగా ప్రవహిస్తున్న మేడి వాగు.. నీటిముంపులో జంగాల‌ప‌ల్లి

ములుగు ప్రతినిధి (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మేడివాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల చిన్నచిన్న కాలువల నుండి వస్తున్న వరద నీటితో మేడి వాగు ఉప్పొంగిపోతోంది. ముఖ్యంగా మదనపల్లి సమీపంలో ఉన్న లోకం చెరువు మత్తడి పోస్తుండడంతో మేడివాగుకు భారీగా వరద చేరుకుంటోంది. దీంతో జంగాలపల్లి సమీపం మొత్తం కూడా జలమయంగా మారిపోయింది.

అలాగే జంగాలపల్లి సమీపంలో ఇటుక బట్టీల కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. వారిని జంగాలపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జంగాలపల్లి రహదారి మొత్తం =జలమయంగా మారిపోవడంతో రాకపోక‌లు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement