Saturday, April 27, 2024

ఇంగ్లండ్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత.. హెచ్చరిస్తున్న నిపుణులు

ఇంగ్లాండ్ లో కరోనా ఆంక్షలన్నింటిని ఎత్తివేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండులో కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికి ఆంక్షలు ఎత్తివేయడంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వచ్చిన్నప్పటి నుంచి పెట్టిన ఆంక్షలన్నింటిని ఎత్తివేసింది. నైట్ క్లబ్బులు, ఇతర ఇండోర్ స్టేడియాలను బార్లా తెరిచేసింది. మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనను, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాట్లను రద్దు చేసింది. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని, ఇంకా వేసుకోనివారెవరైనా ఉంటే వెంటనే టీకా తీసుకోవాలని బోరిస్ సూచించారు. అయితే, ఆంక్షలను ఎత్తేయాలన్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఆంక్షల నుంచి దేశాన్ని బయట పడేయడానికి ఇదే సరైన సమయమన్నారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దేశాన్ని తెరుస్తాం? కాబట్టి ఆంక్షలను ఎత్తివేయడానికి ఇదే సరైన టైం అని నేను భావిస్తున్నామని బోరిస్ జాన్సన్ అన్నారు. అయితే, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన సూచించారు. రోజూ కొత్త కేసులు 50 వేలు నమోదవుతున్నాయని..ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అన్ లాక్ ప్రకటిస్తే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఆంక్షలను ఎత్తేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని ప్రతిపక్ష లేబర్ పార్టీ అధికార ప్రతినిధి జొనాథన్ ఆశ్వర్థ్ మండిపడ్డారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఎలా ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : పార్లమెంటులో 31 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..

Advertisement

తాజా వార్తలు

Advertisement