Wednesday, May 8, 2024

Murder | క‌న్న తండ్రి కర్కశత్వం.. కొడుకును గొంతుకోసి దారుణంగా చంపేశాడు!

కడప జిల్లాలో దారుణం జ‌రిగింది. కమలాపురం మండలం ఆగస్త లింగాయల్లి లో ఓ తండ్రి కొడుకు దారుణంగా చంపేసిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇవ్వాల (బుధ‌వారం) తెల్ల‌వారు జామున ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున కన్నకొడుకుని అతికిరాతకంగా గొంతు కోశాడు కన్న తండ్రి.

అగస్తలింగాయపల్లికి చెందిన వీరంరెడ్డి శంకర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో డోజర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున తన కొడుకు సోమేశ్వర్ రెడ్డి (12) గొంతు కోసి పరారయ్యాడు.
కొన ఊపిరితో కొట్టు మిట్టాడు తున్న సోమేశ్వర్ రెడ్డి ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హత్య కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement