Thursday, May 2, 2024

TS: దైవ భావం ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి.. పోచారం

దైవభావం ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవడంతో సత్ప్రవర్తన కలగడం, మనశ్శాంతి కూడా కలుగుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఎల్లమ్మ గుడి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మనిషి జీవించేందుకు ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టసుఖాలు ఎదురవుతూ ఉంటాయి.. కష్టం వచ్చినప్పుడు దేవుడా నా కష్టాలు గట్టెక్కించు అంటూ ప్రతి ఒక్కరం దేవుని వేడుకుంటూ ఉంటామన్నారు.

ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్లి వస్తే ఎంతో మనసుకి ఆనందం కలగడంతో పాటు మనలో మంచి ప్రవర్తన కూడా వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, వారి సహాయ సహకారాలతో తాను నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆలయాల నిర్మాణాలకు నిధులను మంజూరు చేశానని స్పష్టం చేశారు. సభాపతి వెంట ఆర్డిఓ భుజంగరావు, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement