Saturday, April 27, 2024

Kadiri : రైల్వే గేటును వేయ‌డం మ‌ర‌చిపోయిన సిబ్బంది.. త‌ప్పిన మ‌రో ప్ర‌మాదం

మ‌రో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. క‌దిరిలో రైల్వే గేటును వేయ‌డం మ‌రిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. స్థానికులు, రైలు లోకో పైలట్ అప్రమత్తం కావడంతో మరో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యసాయి జిల్లా కదిరిలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటుతుండటం, గేటు వేయకపోవడం గమనించి లోకో పైలట్‌ రైలును ఆపేశారు.ఈ సమయంలో అక్కడ గేట్ మ్యాన్ కానీ, ఇతర రైల్వే సిబ్బంది కానీ లేకపోవడం గమనార్హం. ఎంత సేపటికీ గేటు వేయకపోవడంతో.. లోకో పైలట్ గేట్ మన్ ఉండే గదిలోకి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీలో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం.

https://twitter.com/KP_Aashish/status/1664893070394159109
Advertisement

తాజా వార్తలు

Advertisement