Tuesday, March 26, 2024

Train Accident: రైలు ప్రమాదంపై సోనియాగాంధీ ఆవేదన

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement