Thursday, May 16, 2024

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ప్రధానమంత్రి ఎక్స్ లెన్సీ అవార్డు

ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఎంపికైనట్లు కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ ను అమలు చేస్తూ రైతులకు అందిస్తున్న సేవలకుగాను ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు చైర్మన్ వివరించారు. ఈ నెల 21న పౌరసేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డుతో పాటు 10 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ తర్వాత ప్రత్యేక గుర్తింపు కలిగిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు రెండవ సారి కూడా ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ప్రత్యేక గుర్తింపు లభించిందని, నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రాన్ని కూడా అందుకోనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల చైర్మన్ గా తన బాధ్యతను మరింత పెంచిందని ఈసందర్బంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement