Wednesday, May 8, 2024

జగన్ కి జై కొట్టిన జేసీ

సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన తండ్రి వైఎస్ లాగానే.. ఆయనలో కూడా చాలా విలువలు ఉన్నాయన్నారు. అది నేను ఈరోజు స్పష్టంగా చూశానని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆయన సహకారం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ ఛైర్మన్‌ అయ్యేవాడిని కాదని అన్నారు. త్వరలో సీఎం జగన్ ని కలుస్తానని తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానన్నారు.

అయితే నిన్నటి వరకు జగన్ ను తిట్టిన జేసీ ప్రభాకర్ ఇప్పుడు జగన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ ను పోగుతున్నాడా లేక దెప్పిపొడుస్తున్నాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంది కాబట్టి తాడిపత్రి అభివృద్ధికి జగన్ తో కలవాల్సిందేనని మరి కొంత మంది మాట్లాడుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement