Wednesday, May 8, 2024

మీ ఉడ‌త ఊపుల‌కు జ‌న‌సేన భ‌య‌ప‌డ‌దు.. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన : ప‌వ‌న్ క‌ల్యాణ్‌

మీ ఉడ‌త ఊపుల‌కు జ‌న‌సేన భ‌య‌ప‌డ‌ద‌ని, మాది రౌడీ సేన కాదని.. విప్లవ సేన అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ అన్నారు. రౌడీయిజం చేసేవాళ్లకు, గుండాయిజం చేసేవాళ్లకు ఎదురు తిరగడం రౌడీయిజమేనని వైసీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. ఎవ‌రు నోరు తెరిచి మాట్లాడ‌కూడ‌దా? ఇది ఆధిప‌త్య అహంకారం కాదా అని ప్ర‌శ్నించారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తాను రోడ్లపైకి వచ్చానన్నారు. ఓ పద్ధతి పాడూ లేకుండా, అన్యాయంగా ఇళ్లు కూల్చివేస్తుంటే ప్రశ్నించేందుకు వచ్చానని వివరించారు. అన్యాయం తన గడప తొక్కే వరకూ వేచి ఉండలేదని, అలా తాను ఉండలేనని స్పష్టం చేశారు. నాపై దాడులు చేసినా ప‌ర్వాలేదు.. అన్నింటికి తెగించే తాను రాజ‌కీయాల్లో వ‌చ్చాన‌న్నారు. వైసీపీ ఎలా గెలుస్తుందో మేమూ చూస్తామ‌ని, ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసి చాడీలు చెప్ప‌డం మాకు రాద‌న్నారు. 2024లో మేము అధికారంలోకి వ‌చ్చాక అదే లీగ‌ల్ విధానంతో మీ ఇళ్ల‌ను కూడా కూల్చుతాం అని మండిప‌డ్డారు. ఇదంతా డిఫాక్టో సీఎం స‌జ్జ‌ల గారి ప్లాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు నాకు ఓటేస్తారో లేదో తెలియదు.. మీరు నాకు ఓటేసినా వేయకపోయినా ఇప్పటం గ్రామానికి, గ్రామస్థులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement