Saturday, April 27, 2024

మంత్రుల వరుసలో కూర్చోమంటే తప్పా : మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ఒకవైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని, తనను మంత్రుల వరుసలో కూర్చోవాలని చెబితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో దళిత సమాజానికి అవమానం అంటూ చిత్రీకరించడం సిగ్గుచేటని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీకి కేసీఆర్ తండ్రి లాంటి వార‌ని, నన్ను గౌరవించి మంత్రుల వరుసలో కూర్చోమన్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వందలాది కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన కుట్రను ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాదారాలతో బయటపెట్టారన్నారు. మీడియా సమావేశం అనంతరం దేశ ప్రజలందరూ బీజేపీని
చీకొడుతుంటే, ఆ అంశంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు దళిత జాతికి అవమానం అంటూ కొత్త డ్రామాకు తెర లేపారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement