Thursday, April 25, 2024

ముగ్గురు అమ్మలు పూజించిన త్రినేత్రుడు

తేప్పెరు మానల్లూరులోని విశ్వనాధ స్వామి ఆలయంలో అమ్మవారిని వేదనాయకి లేదా వేదాం తనాయకిగా సంబోధిస్తారు. ఈ అమ్మవారు సదా వె దాలను వల్లె వేస్తుంటుందని ప్రతీతి. ప్రదోషకాలం లో ఈ అమ్మవారిని దర్శించినవారికి అమ్మవారి పెదవుల తీరులో వ్యత్యాసం గోచరిస్తుంది.ఈ వేద నాయకి అమ్మవారి సన్నిధిలో మకరంద మహర్షి పూజించిన మహా మేరువు వున్నది. వేదనాయకి అ మ్మవారికి గాజులమాల వేసి పూజించడం విశిష్టత. ముఖ్యంగా భాద్రపద నవరాత్రి పుణ్యకాలంలో గా జుల మాలలతో అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధ లతో వేడుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు దృఢంగా నమ్ముతారు.
కాంచీపురంలో గల లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మలు మూడు వేర్వేరు ఆలయాలలో ఈశ్వరుని పూజించారు.
పార్వతీదేవి ఇసుకతో శివలింగం చేసి మామిడి వృక్షం క్రింద ఏకాంబరేశ్వరుని పూజించినది.
సరస్వతీదేవి కఛ్ఛపేశ్వరుని పూజించి సర్వకళ లకి అధిదేవత అయినది.
మహాలక్ష్మి దేవి కాయారోహణశ్వరుని పూజిం చి ఐశ్వర్యాలకి అధిదేవత అయినది.

Advertisement

తాజా వార్తలు

Advertisement