Saturday, May 4, 2024

AP : నామినేష‌న్ వేసిన సీఎం జ‌గ‌న్‌..

పులివెందుల‌ల బ‌హిరంగ స‌భ అనంత‌రం జ‌గ‌న్ భారీ ర్యాలీగా మినీ సెక్రటేరియట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాల‌యానికి చేరుకున్నారు.. అక్క‌డ రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. సీఎంతో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఉన్నారు. సీఎం జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్థులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు.

- Advertisement -

అంతకు ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. నేతలతో భేటీ ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత ఆయన పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీనేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి చేయాల్సిన కృషితో పాటు అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement