Sunday, May 12, 2024

BIG FIGHT : ఫ‌స్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భార‌త్ ఢీ

వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది.

లీగ్ దశలో కివీస్ ను మట్టి కరిపించిన భారత్ సెమీస్ లోనూ అదే జోరు కనబరిచి ఫైనల్స్ లో అడుగు పెట్టాలన్న ఉత్సాహంతో ఉంది. వరుసగా రెండో సారి వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడుతున్న టీమిండియా 2019లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement