Friday, May 3, 2024

HYD : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి ఇంటి పై అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు..

ఎల్బీనగర్, నవంబర్ 15 (ప్రభ న్యూస్) టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ హయత్ నగర్ లో నివాసం ఉంటున్న ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు మరియాష్కి ఇంటికి చేరుకున్నారు.

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో చొరబడి సోదాలు చేయడమేంటని పోలీసులను మధుయాష్కి నిలదీశారు. డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారంటూ ఫిర్యాదు అందితేనే తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పడంతో కంప్లైంట్ ను చూపెట్టాలని అయనడిమాండ్ చేశారు, అర్ధరాత్రి ఇంత పెద్ద మొత్తంలో పోలీసుల తనిఖీల మర్మం ఏమిటో చెప్పాలన్నారు. సోదాల పేరుతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం తప్ప మరేం లేదన్నారు. పారదర్శకంగా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహించడం సరికాదన్నారు. బారాసా కు చెందిన అభ్యర్థుల ఇళ్లను తనిఖీలు చేసే దమ్ముందా మీకు అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మధుయాష్కి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement