Wednesday, May 8, 2024

లక్ష ఇస్తే నీ కాపురం నిలబెడతా – పోలీస్ దొర

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే లక్ష రూపాయలిస్తే సంసారం చక్కదిద్దుతానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఓ పోలీస్ అధికారి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాదు సోషల్ మీడియా లో బాధిత మహిళతో ఎస్ఐ మాట్లాడిన వాయిస్ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. నిజామాబాద్ నగరానికి చెందిన అర్చనకు హైద్రాబాద్ ఘట్ కేసర్ కు చెందిన ప్రణయ్ తో గత ఆగస్టులో వివాహం జరిగింది. పెళ్లి సమయం లో కట్నం కింద 35 తులాల బంగారం 10 లక్షల నగదు 2 కేజీ ల వెండిని ప్రణయ్ కు ఇచ్చారు.ప్రణయ్ ఓ ప్రముఖ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు.

గంజాయి, డ్రగ్స్ కు బానిసైన ప్రణయ్అదనపు కట్నం తేవాలని లేదంటే విడాకులు ఇవ్వాలని పెళ్ళైన నెల వేధింపులు స్టార్ట్ చేశాడు. దీనితో దిక్కుతోచక అర్చన పోలీసులను ఆశ్రయించింది. కానీ స్థానిక ఎస్ ఐ మాత్రం లక్ష ఇస్తేనే న్యాయం చేస్తానని లేకపోతే నీ పని జరగదని హెచ్చరించాడు. అందుకు సంబందించిన ఆడియో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement