Friday, April 26, 2024

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతుందా ? కొత్త కేసులు ఎన్నో తెలుసా ?

దేశంలో గడిచిన నాలుగు రోజులుగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 3,26,098‬ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మహమ్మారి కారణంగా 3890మంది మృతి చెందారు. అదే విధంగా 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజా గణాంకాల ప్రకారం….దేశంలో మొత్తం 2,43,72,907‬ కేసులు నమోదు కాగా 2,66,207 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. అలాగే ఇప్పటివరకు 2,04,32,898 మంది కొలుకున్నారు. ఇంకా 36,73,802 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement