Thursday, April 25, 2024

కళ్యాణదుర్గం వైసీపీలో భగ్గుమన్న రాజకీయ కక్షలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతతో పాటు టీడీపీ నాయకుడిపై వైసీపీ నాయకుడు గోళ్ళ సూరి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గోళ్ల గ్రామ శివారులో ఇరువురు వర్గీయులు రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య ఓటమికి కారణమయ్యారంటూ ఇద్దరు వ్యక్తులపై కొడవళ్ళతో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన మోహన్ రెడ్డి, టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ రామ్మోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడ్డ వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement