Saturday, April 27, 2024

24 గంటలు… లక్ష చేరువలో కేసులు.. వందల్లో మరణాలు !!

దేశంలో విపరీతంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులునమోదవుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల్లో మృతి చెందుతున్నారు. తాజాగా గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 714 మంది చనిపోయారు. అలాగే 89,129 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 1,64,110కి చేరింది. మరోవైపు 1,15,69,241మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకోగా 6,58,909 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement