Wednesday, May 22, 2024

రిపోర్టర్ పై సీరియస్ అయిన హీరోయిన్

ఓ రిపోర్టర్ పై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మండిపడింది. హీరో అల్లు శిరీశ్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించింది. కాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమెకు చికాకు కలిగింది. మీరు అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చేశారు… ఇప్పుడు అల్లు శిరీశ్ తో ‘ఊర్వశివో రాక్షసివో’ చేశారు… అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ అని రిపోర్టర్ అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన అను… అడగడానికి ఇంతకన్నా మంచి ప్రశ్నలు లేవా అని అసహనం వ్యక్తం చేసింది. దీంతో సదరు రిపోర్టర్ మరో ప్రశ్న వేశాడు. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదని… అందువల్ల దీనికి సమాధానం చెప్పలేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement