Saturday, May 4, 2024

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం: గుత్తా

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తిరిగి అధికారంలోకి తీసుకొస్తానన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డివి పగటి కలలేనని ఆయన ఆరోపించారు. నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి… ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న లుకలుకలు సరిదిద్దుకోవడానికే రేవంత్‌కు సమయం సరిపోదని, ఇక పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొస్తారని ఎద్దేవా చేశారు.రేవంత్‌రెడ్డి ఉత్తర కుమారుడిగా మిగిలిపోతారని అన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి జరిగిన జలదోపిడీని వ్యతిరేకించినట్టు చెప్పారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచి ఏపీ దోచుకుంటూనే ఉందని ఆరోపించారు. ఇప్పుడు జగన్ కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను తరలించుకుపోవాలని చూస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement