Wednesday, April 24, 2024

గుంటూరులో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు సోమవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట పైనాపిల్ లోడు మాటున లారీలో గంజాయి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని అంచనా. ఇక్కడ గంజాయి విలువ కేజీ 20 వేల రూపాయల వరకు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement