Sunday, May 19, 2024

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గెస్ట్‌ లెక్చరర్‌ అరెస్టు

కర్ణాటక పరీక్షా ప్రాధికార మార్చి 14న 1200 పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో లీక్ కావ‌డానికి కారకురాలిగా భావించి మైసూరుకు చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్య ఆర్‌ను అరెస్టు చేశారు. భూగోళ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నప్రతంలోని 18 ప్రశ్నలను వాట్సాప్‌ ద్వారా లీక్‌ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రశ్నపత్రం లీక్‌పై పరీక్షా ప్రాధికార ఫిర్యాదుతో మల్లేశ్వరం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మైసూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్‌ సౌమ్య సూత్రధారిగా భావించిన పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement