Wednesday, May 8, 2024

HYD: రేపే హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీన‌రీ.. ఆ రూట్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

టీఆర్ఎస్ ప్లీన‌రీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ప్లీనరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయి. హైద‌రాబాద్ వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గులాబీ పోస్ట‌ర్లు, క‌టౌట్ల‌ను ఏర్పాటు చేశారు.  హెచ్ఐసీసీలో నిర్వ‌హించే టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు ఆంక్ష‌లు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. రేపు ప్లీన‌రీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ప్లీన‌రీ జ‌ర‌గ‌నున్న‌ హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌తో పాటు సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని ఆఫీసుల‌ నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు.

రేపు ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు. నీరూస్‌ జంక్షన్‌-సైబర్‌ టవర్స్‌, జంక్షన్‌-మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-గూగుల్‌ (సీఐఐ) జంక్షన్‌-కొత్తగూడ జంక్షన్‌ రోడ్డులో ట్రాఫిక్ ర‌ద్దీ అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. జేఎన్‌టీయూ-సైబర్‌ టవర్స్‌-బయో డైవర్సిటీ జంక్షన్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్‌-బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌- కొత్తగూడ జంక్షన్‌-కొండాపూర్‌ జంక్షన్ల వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాలుగా నీరూస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ నుంచి దుర్గం చెరువు, ఇనార్బిట్‌-ఐటీసీ కోహినూర్‌-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపునకు వెళ్ల‌కూడ‌దు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement