Sunday, May 19, 2024

Great Honor – ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్ లు….

లాస్ ఏంజెల్స్ – ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఆ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు చెందిన ఆరుగురు ఉండటం విశేషం. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. ఇక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు కూడా స్థానం లభించింది.

కాగా, ఇదే సమయంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు లిస్టులో లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఎంతో కృషి చేసిన జక్కన్నకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక, కొత్తగా చేరిన మెంబర్స్ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా అకాడమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. వారు వేసే ఓటింగ్ ద్వారానే అస్కార్ అవార్డు విజేత‌లు నిర్ణ‌యిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement