Tuesday, April 30, 2024

విశాఖలో రియల్టర్ శ్రీనివాస్ దంపతుల కిడ్నాప్

విశాఖపట్టణంలో గురువారం రియల్ ఏస్టేట్ ఏజంట్ శ్రీనివాస్, ఆయన భార్య లక్ష్మిని దుండగలు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా… విజయవాడ నుండి విశాఖపట్టణానికి వచ్చిన రియల్ ఏస్టేట్ ఏజంట్ శ్రీనివాస్ దంపతులు కిడ్నాప్‌నకు గురయ్యారు.

రియల్ ఏస్టేట్ సంస్థలో శ్రీనివాస్ ఏజంట్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ పై గతంలో విజయవాడలో కేసు నమోదైంది. రియల్ ఏస్టేట్ సంస్థలో అవకతవకలకు పాల్పడ్డారని శ్రీనివాస్ పై ఆరోపణలున్నాయి. అవకతవకలకు పాల్పడి స్వాహా చేసిన డబ్బుల్లో తమకు కొంత వాటా ఇవ్వాలని దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ నకు పాల్పడిన నలుగురు నిందితులను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement