Friday, May 17, 2024

AP: బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుద‌ల..

అమరావతి: ఏపీ ఎన్నికల కు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ్యానిపెస్టలోని ముఖ్యమైన హామీలు ..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల చొప్పున భృతి.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.
ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.
ఇసుక ఉచితం.
భూ హక్కు చట్టం రద్దు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం.
ఇసుక ఉచితం.
భూ హక్కు చట్టం రద్దు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం.
బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

- Advertisement -

వృద్ధాప్య పింఛను నెలకు రూ.4వేలు, పెంచిన పింఛను ఏప్రిల్-2024 నుంచి అమలు.
బీసీలకు 50ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛను.
రాజధానిగా అమరావతి కొనసాగింపు.
కలలకు రెక్కలు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు.
ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ,
ఎన్డీయే తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు.
చట్టసభల్లో బీసీలకు 18శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు,
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు.
ఉద్యోగుల సీపీఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచిస్తాం.
ఔట్ సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.
వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.
కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం.
ఆదరణ పథకం కింద ఏటా రూ.5 వేల కోట్లతో పరికరాలు.
అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తాం.
దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం.
గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు.
చేనేత మ‌ర‌మ‌గ్గాల‌కు 200 యూనిట్ల‌ ఉచిత విద్యుత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement