Sunday, April 28, 2024

Jobs – గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు – దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి, జూన్ 29 ( ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023-24 సంవత్సరంనకు తాత్కాలికంగా ఉపాధ్యాయ/అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన ఇంగ్లీష్ మీడియం లో బోధించగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టి.టి.డబ్లు.ఆర్.ఈ. సంగారెడ్డి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ పిఎస్ కళ్యాణి గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాలను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నుండి పొందవచ్చని, పూరించిన దరఖాస్తుతో అభ్యర్థి విద్యార్హతల జిరాక్స్ ప్రతులను జతచేసి జులై 5వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు అదే పాఠశాలలో సమర్పించాలన్నారు.

దరఖాస్తుదారులు జులై,7న ఉదయం 9:00 గంటలకు రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్, మానస హిల్స్, టి టి డబ్ల్యూ ఆర్. ఐఐటి స్టడీ సెంటర్లో గల రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో డెమో మరియు ఇంటర్వ్యూ కు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని సూచించారు. బాలికల విద్యాలయాల్లో మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.

జూనియర్ లెక్చరర్ పోస్టులు 10, పి జి టీ లు- 13, టీజీటీలు-10, పిడి లు – 2, పి ఈ టి – 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ – 1 మొత్తం (37)పోస్టులు ఖాళీలు గలవని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8333925393
లో సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నిర్ణీత సమయంలో గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement