Friday, May 3, 2024

WGL : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. మహేశ్వరం తండాకు చెందిన గుగులోత్ ఉజ్జన్ రోజు వారి కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో చనిపోయి ఉండటం ఒకింత గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన వైకుంఠ దామంలో ఉరి వేసుకొని చనిపోగా.. గమనించి పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య సాంబ, కొడుకు రాజ్ కుమార్, కూతురు మంజుల లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement