Sunday, April 28, 2024

National: బోరుబావిలో పడ్డ బాలిక… కొనసాగుతున్న సహాయక చర్యలు…

ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బోర్‌వెల్‌కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సన్నాహాలు చేస్తోంది. బోర్‌వెల్ లోతు 40బావి దిగువన ఉన్న బాలికను బయటకు తీయడం చాలా కష్టం.. కొత్త బోరుబావిని తవ్వేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.. బోర్‌వెల్ దగ్గర జెసిబితో దాదాపు 50 అడుగుల మేర తవ్వారు.. ఆ తర్వాత వారు పైపును త్రవ్వి బావి నుండి బయటకు తీస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement