Friday, May 3, 2024

TS : రైలు ఢీకొని గొర్రెల కాపరి,80 గోర్రెలు మృతి….

హన్మకొండలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.కాజీపేటలో ట్రైన్ ఢీకొని గొర్రెల కాపరితో పాటు, 80 గొర్రెలు మృతి చెందారు. ఈ సంఘటన కాజీపేట వరంగల్ రూట్ లో శాయంపేట గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

రైలు వస్తున్న క్రమంలో గేటు వేయగా.. కాపరి గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ రైలు అనుకున్నదానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి. వాటిని పట్టాల నుంచి తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టిగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం అనంతరం రైలు పట్టాలపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడి ప్రజలను దు:ఖానికి గురి చేసింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement