Monday, May 13, 2024

ఆనందయ్య మందు పై నేడు ఫైనల్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలతోపాటు భారతదేశం మొత్తం నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య వైపే చూస్తోంది. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆనందయ్య మందే కరెక్ట్ అని అందరూ భావిస్తున్నారు. కాగా నేడు ఆనందయ్య ఔషధం పై తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరు పై ఇప్పటికే అధ్యయనం చేసిన వైద్య బృందాలు ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థకు ఆన్లైన్ రిపోర్టులను పంపించాయి. వాటిని పరిశీలించిన ఆ సంస్థ పరిశోధకులు ఆ మందు పై ఈరోజు క్లారిటీగా ఇవ్వనున్నారు. అలాగే మందు పంపిణీ పై హైకోర్టులో నేడు తుది విచారణ కూడా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement