Thursday, May 2, 2024

Breaking: కూలిన కల్వర్టు.. స్పాట్ లోనే ఐదుగురు దుర్మరణం

ఘోర రోడ్డుప్రమాదం జరగడంతో స్పాట్ లోనే ఐదుగురు దుర్మరణం చెందిన విషాద ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలిపోవడంతో ఈ రోడ్డుప్రమాదం సంభవించింది. కల్వర్టు కూలిపోవడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ఈ ప్రమాదం ఒడిషా రాష్ట్రంలోని రాయగడ జిల్లా ఉపరసజలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement