Wednesday, May 8, 2024

NZB: చెట్టును ఢీకొట్టిన ఆటో.. 10మందికి గాయాలు

జక్రాన్ పల్లి, జులై 31 (ప్రభ న్యూస్) : ఆటో చెట్టును ఢీకొట్టడంతో 10మందికి గాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టు ను ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు అంబులెన్సులో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ నుంచి కేశ్ పల్లికి అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement