Tuesday, May 7, 2024

All Safe – షార్జా ఫైట్ లో సాంకేతిక‌లోపం – అత్య‌వ‌స‌ర ల్యాండింగ్..

త్రివేండ్రం – షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపంతో త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది. .తిరుచిరాప‌ల్లి నుంచి షార్జా బ‌య‌లుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 613 సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.03 గంట‌ల ప్రాంతంలో తిరువ‌నంత‌పురం స‌మీపంలోని త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ప్ర‌యాణీకులు అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పి ప్ర‌యాణీకులంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయిన స‌మ‌యంలో విమానంలో 154 మంది ప్ర‌యాణీకులు ఉన్నార‌ని ఎయిర్ ఇండియా ప్ర‌తినిధి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement