Thursday, May 16, 2024

భలే కేటుగాళ్లు.. పోలీస్ స్టేషన్‌లోనే డబ్బు మాయం చేశారు

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో పోలీస్ స్టేషన్‌లో ఉంచిన రూ.8 లక్షల డబ్బు మాయమైంది. బ్యాంకులకు రెండు రోజులు సెలవులు కావడంతో నాలుగు వైన్ షాపుల నగదును యజమానులు పోలీస్ స్టేషన్‌లోని లాకర్‌లో ఉంచారు. తాజాగా ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా డబ్బు కన్పించలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బును ఎవరైనా చోరీ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పీఎస్‌తో పాటూ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించే పనిలో ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ కాగా.. పోలీస్ స్టేషన్‌లోనే డబ్బుకు సేఫ్టీ లేదంటే ఇంకా ఎక్కడ ఉంటుందని పలువురు నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement