Friday, April 26, 2024

నేటినుంచి ఈసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌..14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

టీఎస్‌ఈసెట్‌ విద్యార్థులు అలర్ట్.. నేటి నుంచి తుదివిడత కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. 14, 15 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 17న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 17 -20 వరకు ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని సూచించారు. ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6,894 సీట్లు లభ్యంకానున్నాయి. ఈ సీట్లను పూర్తిగా కన్వీనర్‌ కోటాలో భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 6,521, బీ ఫార్మసీలో 321, ఫార్మా -డీలో 52 సీట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement