Thursday, May 2, 2024

మధిరలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ‘గౌతమ్’

ఖమ్మం జిల్లా మధిరలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యటించారు . ఈ సందర్భంగా ఆక్రమణకు గురైన ఎండిఓ కార్యాలయం పక్కన ఉన్న స్థలాలకు అనుమతి ఉందా లేదా? ఆక్రమణ ఆరోపణలపై తహసిల్దార్ మున్సిపల్ కమిషనర్ జాయింట్ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మధిర‌లో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డికి ఆయన సూచించారు. మధిర మార్కెట్ యార్డ్ లో మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావుకి కలెక్టర్ తెలిపారు. సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం పలు స్థలాల‌ని కలెక్టర్ పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న బడ్డీ కొట్లను తొలగించాలని కమిషనర్ అంబటి రమాదేవిని కలెక్టర్ ఆదేశించారు ఆయన వెంట ఆర్డిఓ రవీందర్ తహసిల్దార్ రాజేష్ ఎంపిడివో కుడుముల విజయభాస్కర్రెడ్డి కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement