Saturday, May 4, 2024

ఆర్ఓబీకి రూ.100 కోట్లు మంజూరు : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక‌ త్వరలో నెరవేరనుంది. ప్రతినిత్యం కునారం రైల్వే గేట్ వద్ద పడిగాపులు కాసే వాహనదారులకు మోక్షం లభించనుంది. కూనారం రోడ్డులో గల రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇందుకు కృతజ్ఞతగా పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా ఆర్ఓబీ లేకపోవడం వల్ల ప్రజలు ప్రతినిత్యం అసౌకర్యానికి గురయ్యారన్నారు. గత పాలకులు ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినా నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు. త్వరితగతిన ఆర్ఓబీ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement