Saturday, April 27, 2024

ట్రాక్టర్, ట్రాలీలు దొంగతనం – ముఠా అరెస్ట్ : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

నల్లగొండ : పొలాల వద్ద, కాలువ కట్టల మీద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుండి ఐదు ట్రాలీలు రికవరీ చేయడంతో పాటు ఒక ఇంజన్ కలిగిన ట్రాక్టర్, ఒక బైక్ సీజ్ చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ డిఎస్పీ కార్యాలయంలో శాలిగౌరారం సిఐ రాఘవరావు, సిసిఎస్ సిఐ దుబ్బ అనిల్, తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా సభ్యుల వివరాలు తెలిపారు. వారు చేసిన దొంగతనాలను మీడియాకు వివరించారు.

తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఎస్.ఐ. సత్యనారాయణ సిబ్బందితో కలిసి దుప్పలపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై నల్లగొండ నుండి తిప్పర్తి వైపుకు వస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించామ‌న్నారు. విచారణలో భాగంగా నల్లగొండ పట్టణం ఏ.ఆర్.నగర్ కు చెందిన దుంప సంపత్, కట్టంగూరు మండలం పిట్టంపెళ్లికి చెందిన సురిగి మధు, నల్లగొండ పానగల్ కు చెందిన అలకుంట్ల వెంకన్న, ఖమ్మంకు చెందిన ఓర్సు రామకృష్ణ, ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘు, నల్లగొండ ఏ.ఆర్.నగర్ కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి కాలువ కట్టల మీద, వ్యవసాయ పొలాల వద్ద, పశువుల కొట్టాల వద్ద నిలిపి ఉంచుతున్న ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement