Thursday, March 28, 2024

‘గుమ్మ‌డి’ స్ప‌ర్శే వేరంటోన్న ప్ర‌కాశ్ రాజ్

పాత‌జ్ఞాప‌కాల‌ని నెమ‌రువేసుకున్నారు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోల‌ని ఆయ‌న పోస్ట్ చేశారు. కాగా నాటి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురితో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ‘డా.రాజశేఖర్ రెడ్డి , డా.దాసరి నారాయణరావు.. డా.గుమ్మడి గారి ఆ స్పర్శ ఆహా’ అంటూ ప్ర‌కాశ్ రాజ్ తెలిపారు. కాగా, ప్ర‌కాశ్ రాజ్ త‌న కెరీర్‌లో ఎనిమిది నంది అవార్డులు అందుకున్నారు. దేశంలోని ప‌లు భాష‌ల చిత్రాల్లో న‌టించి మెప్పించారు. నేటికి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement