Saturday, April 27, 2024

బీజేపీలో చేరిన దినేష్ మోంగియా..

చండీగఢ్ : వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో వివిధ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీ తీర్థం తీసుకున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు పతేహ్ జంగ్ బాజ్వా, బల్వీందర్ సింగ్ లద్దీ, రాణా గుర్మీత్ సోథి బీజేపీలో చేరారు.

వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. దీంతో శతాధిక కాంగ్రెస్ కు గట్టి దెబ్బతగిలినట్టయింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో కలసి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement