Thursday, May 16, 2024

శివుని పూజ‌లో డిఐజి రంగ‌నాథ్ కుటుంబం..

నల్లగొండ : కార్తీకమాసం దీపాల వెలుగులతో ప్రకాశవంతంగా నల్లగొండ జిల్లా అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి చెందాలని డిఐజి ఏ.వి.రంగనాధ్ ఆకాంక్షించారు. కార్తీకమాసం సందర్భంగా ఆయన నల్లగొండ పట్టణ శివారు పానగల్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైన ఛాయాసోమేశ్వర స్వామి ఆలయంలో సతీమణి లావణ్య రంగనాధ్, కుమార్తె రిషిత, కుమారుడు విజయ్ కౌశిక్ లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి, జిల్లాలో శాంతియుత వాతావరణం ఉండేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డిఐజి రంగనాధ్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో డిఐజి రంగనాధ్,కుటుంబ సభ్యులు రుద్రాక్ష మొక్క నాటారు. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించి ఆలయ కమిటీ, రుద్రసేన సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి, ఈఓ ప్రభాకర్ రావు ఆలయ అర్చకులు అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ తదితరులు డిఐజి కుటుంబానికి స్వాగతం ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement