Thursday, May 16, 2024

మోదీ, జగన్ ఇద్దరు లూటీ సోదరులు: శైలజానాథ్

ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరు పెట్రోల్ డీజిల్ లపై టాక్స్ ల రూపంలో అధిక ధరలతో ప్రజలను లూటీ చేస్తున్నారనీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలపై సుమారు 30 నుండి 50 రూపాయల వరకు తగ్గించవచ్చని తెలిపారు. మోడీ, జగన్ లు ప్రజల ఆస్తులను తమ స్నేహితులకు సన్నిహితులకు తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జన జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికలు ఉన్నచోట ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తామన్నారు. 15 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందని శైలజానాథ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపిలో రికార్డు స్థాయిలో తగ్గిన నిరుద్యోగం.. ఇదీ విజయసాయి లెక్క!

Advertisement

తాజా వార్తలు

Advertisement